telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్ని విప్పేసి వీడియోలు తీశారు : జోగిని శ్యామలపై ఓ మహిళ ఫిర్యాదు

జోగిని శ్యామల పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే బోనాల పండుగలో తన ఆటపాటలతో, అందచందాలతో అందరిని ఆకట్టుకుంటుంది. అయితే… తాజాగా జోగిని శ్యామలపై పంజాగుట్ట పీఎస్‌ లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు అయింది. మెదక్ లోని ఏడుపాయల జాతరలో తనపై దాడి చేసి అభ్యంతర కరంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది స్రవంతి అనే మహిళ. ఈ నెల 12న తల్లితో కలసి ఏడు పాయల జాతరకు స్రవంతి పట్ల జోగిని శ్యామల అసభ్యంగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలోనే బాధిత మహిళ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ కేసును పంజాగుట్ట పీఎస్‌ నుండి మెదక్ జిల్లా పాపన్నపేట పీఎస్ కు బదిలీ చేశారు. అయితే.. దీనిపై జోగిని శ్యామల స్పందించింది. కేసు పెట్టిన జోగిని స్రవంతియే తనపై దాడి చేసిందంటూ శ్యామల పేర్కొంది. తాగి వచ్చి జాతరలో గొడవ సృష్టించిందని.. వీడియోలో పోలీసులపై స్రవంతి దాడి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. తన ఎదుగుదల చూసి, పరువు తీయడానికి ఇవన్నీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది జోగిని శ్యామల.

Related posts