నేషనల్ హెరాల్డ్ కేసును, దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న కారణంగా కొద్దిరోజులపాటు వాయిదా వేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీలు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు వాయిదా ఏప్రిల్ 23వ తేదీన ఉన్న నేపధ్యంలో శుక్రవారం న్యాయమూర్తులకు ఈ వినతి అందించారు. నేషనల్ హెరాల్డ్, యంగ్ఇండియా సంస్థల్లో సోనియా, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు.
ఈ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ అసెస్మెంట్ చేయాలని కోరుతూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సోనియా, రాహుల్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పన్ను ప్రొసీడింగ్స్ను తిరిగి తెరిచే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉందంటూ వీరి పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేస్తూ కేసును ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది. లోక్సభకు ఎన్నికలు జరుగుతుండడంతో ప్రచారంతో బిజీగా ఉన్న సోనియా, రాహుల్లు వాయిదా కోరుతూ అపెక్స్ కోర్టును ఆశ్రయించారు.
పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి