telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ ప్రభుత్వానికి బండి సంజయ్‌ వార్నింగ్‌…

తెలంగాణ బీజేపీలో ఒక ఊపు తీసుకువచ్చిన నేత బండి సంజయ్‌. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ పార్టీ మంచి ఫలితాలను రాబడుతోంది. ఫలితాలతో పాటు కేసీఆర్‌ ప్రభుత్వంపై బీజేపీ తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్‌ అయ్యారు. సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలని.. సీఎం కేసీఆర్ ప్రోద్భలతోనే హిందు మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్ర జరుగుతోందని ఫైర్‌ అయ్యారు. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయని.. మీరు లెక్కలు తీస్తారా… కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడినుంచి తీయించమంటారా? అని ప్రశ్నించారు. హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోందని.. చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోందన్నారు. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన పెట్టుకున్నారని… ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటి సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోందని చురకలు అంటించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు బండి సంజయ్‌.

Related posts