* వైసీపీ ఎమ్మెల్సీ కారులో అనుమానస్పదంగా యువకుడి మృతదేహం ..
*గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన సుబ్రమణ్యం
*సుబ్రమణ్యంను కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపణ
*సుబ్రమణ్యం మృతదేహన్నికారులో తీసుకొచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు..
*సుబ్రమణ్యం ఆందోళన చేయడంతో కారులోని వదిలి వేళ్ళిన ఎమ్మెల్సీ అనంతబాబు
*నిన్న అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా.. పార్టీలో మునిగితేలిన అనంతబాబు అనుచరులు..
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది. సుబ్రహ్మణ్యం గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేశాడు.
నిన్న అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు పార్టీలో మునిగితేలారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు నేరుగా సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకెళ్లగా..సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో అనంతబాబు కారులో మృతదేహాన్ని వదిలి వెళ్ళిపోయారు.
నిన్న రాత్రి పదిన్నర సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని.. ఒంటిగంట సమయంలో బైక్ ప్రమాదంలో మృతి చెందినట్లు ఎమ్మెల్సీ చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. వాళ్లే తమ కొడుకును హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సుబ్రహ్మణం డెడ్ బాడీపై మట్టి, కాళ్లు చేతులు విరిచేసిన ఆనవాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము మాట్లాతుండగా దీన్ని ఇష్యూ చేయవద్దని అనంతబాబు అన్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం ఆరు నెలల క్రితం అనంతబాబు దగ్గర ఉద్యోగం మానేశాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.