*ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల..
*ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన బొత్స..
*ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసినవారు 4,45,604 మంది
*సెకండ్ ఇయర్ పరీక్ష రాసినవారు4,23, 455
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల ఫలితాలను విద్యాశాఖ మంత్రి \ బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలు విడుదల చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. ఇంటర్ ఫస్టియర్లో 2,41,599 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు.
అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.
కాగా..ఈ నెల 25 నుంచి జూలై 5 వరకు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఆగస్ట్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు
పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.