నేడు షియోమీ భారత మార్కెట్లో ఎంఐ సోనిక్చార్జ్ పేరిట 27వాట్ల సామర్థ్యం కలిగిన ఓ నూతన సూపర్ఫాస్ట్ చార్జర్ను విడుదల చేసింది. ఇందులో క్వాల్కామ్ క్విక్చార్జ్ 4.0 టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ చార్జర్తో ఫోన్లను వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ను ఈ చార్జర్తో చాలా వేగంగా చార్జ్ చేయవచ్చు.
ఈ చార్జర్ తో 0 నుంచి 58 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలాగే కేవలం 15 నిమిషాలపాటు ఫోన్ చార్జింగ్ పెడితే 10 గంటల పాటు 4జీ కాల్స్ చేసుకునేంతటి చార్జింగ్ను ఈ చార్జర్ ద్వారా పొందవచ్చు. ఇక ఈ చార్జర్ను వినియోగదారులు ఎంఐ ఆన్లైన్ స్టోర్లో రూ.999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవిలత