పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. గురువారం ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ కి ముందే 38.50 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కిందని ప్రచారమైంది. అయితే నిజానికి వరల్డ్వైడ్గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అమ్ముడయ్యాయి. దీనికి అదనంగా శాటిలైట్-ఆడియో- డిజిటల్ రైట్స్ కలిసి రానున్నాయని తెలుస్తోంది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి రూ. 17 కోట్ల మేర టేబుల్ పైకి వచ్చింది. రూ.17- 20 కోట్ల మేర థియేట్రికల్ షేర్ వసూలు చేస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయినట్టేనని భావిస్తున్నారు.
ఏరియాల వారీగా ఈ సినిమా బిజినెస్ కోట్లలో…
నైజాం – 6.50
సీడెడ్ – 2.52
వైజాగ్ – 1.40
ఈస్ట్ – 1.05
వెస్ట్ – 0.90
కృష్ణా – 0.95
గుంటూరు – 1.10
నెల్లూరు – 0.48
ఏపీ + తెలంగాణ -14.90 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.20
రెస్టాఫ్ వరల్డ్ – 0.90
వరల్డ్వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ – 17 కోట్లు