హీరోయిన్, క్యాస్టూమ్ డిజైనర్, డైరెక్టర్, రచయిత్రి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకునే రేణు దేశాయ్ ఈసారి కూడా అలాంటి ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్స్ కు ఒక రిక్వెస్ట్ చేసారు. మాములుగా పెట్రోల్, డిజిల్ తో నడిచే కార్ల కంటే కూడా విద్యుత్ తో నడిచే కార్లను వినియోగించమని చెప్తున్నారు. అందులో భాగంగా ముందు తానే తన లగ్జరీ కార్లు అయినటువంటి ఆడి ఏ6 మరియు పోర్ష్ బాక్స్టెర్ ను అమ్మి కొత్త ఎలెక్ట్రిక్ కారును కొనుకున్నానని తెలిపారు. దీనికి అంతటికి ప్రధాన కారణం తన వంతుగా తాను పర్యావరణంలో కార్బన్ ను తగ్గించడం కోసమే అని ఆమె తెలిపారు. తాను చదివిన ఓ కథనం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.
previous post
సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు