telugu navyamedia
క్రీడలు వార్తలు

రెండు వారాల తర్వాత కూడా సాహాకు కరోనా పాజిటివ్..

ఐపీఎల్​ సందర్భంగా కరోనా బారిన పడిన ఈ వికెట్ కీపర్​ వృద్దీమాన్ సాహా.. రెండు వారాల పాటు ఐసోలేషన్​లో ఉన్నాడు. అయినప్పటికీ.. రెండోసారి నిర్వహించిన టెస్ట్​లోనూ అతనికి వైరస్​ ఉన్నట్లు తేలింది. దీంతో సాహా ఢిల్లీలోని హోటల్​ గదికే పరిమితమయ్యాడు. త్వరలోనే మరో విడత పరీక్షలు చేయనున్నారు. సోమవారం నాటికి క్వారంటైన్​ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రపంచ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రకటించిన 24 మందితో కూడిన భారత జంబో జట్టులో సాహాకు చోటు దక్కింది. ఈ తరుణంలో రెండో సారి కరోనా పాజిటివ్​గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. జూన్​ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఆ సమయానికి సాహా ఫిట్​నెస్​ నిరూపించుకుంటేనే.. డబ్ల్యూటీసీ మ్యాచ్​లో ఆడతాడు. లేకుంటే భారత్‌లోనే ఉండిపోతాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఏ ఆటగాడైనా.. కరోనా బారిన పడితే ఇక్కడే వదిలేసి వెళ్తామని, వారి ఒక్కరి కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయలేమని బీసీసీఐ స్పష్టం చేసింది.

Related posts