ఐపీఎల్ సందర్భంగా కరోనా బారిన పడిన ఈ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహా.. రెండు వారాల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. అయినప్పటికీ.. రెండోసారి నిర్వహించిన టెస్ట్లోనూ అతనికి వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో సాహా ఢిల్లీలోని హోటల్ గదికే పరిమితమయ్యాడు. త్వరలోనే మరో విడత పరీక్షలు చేయనున్నారు. సోమవారం నాటికి క్వారంటైన్ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ప్రకటించిన 24 మందితో కూడిన భారత జంబో జట్టులో సాహాకు చోటు దక్కింది. ఈ తరుణంలో రెండో సారి కరోనా పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఆ సమయానికి సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే.. డబ్ల్యూటీసీ మ్యాచ్లో ఆడతాడు. లేకుంటే భారత్లోనే ఉండిపోతాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఏ ఆటగాడైనా.. కరోనా బారిన పడితే ఇక్కడే వదిలేసి వెళ్తామని, వారి ఒక్కరి కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయలేమని బీసీసీఐ స్పష్టం చేసింది.
previous post
next post