telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న సీఎం జగన్

cm jagan ycp

ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించడంలేదు.

సీఎం జగన్ ఈ నెల 23న సాయంత్రం తిరుమల చేరుకుంటారు. ఆ రోజున జరిగే గరుడ సేవను పురస్కరించుకుని సీఎం జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు.

దర్శనం తర్వాత నాదనీరాజనం మంటపంలో నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. అనంతరం తిరుమలలో కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపలో యడియూరప్పతో కలిసి జగన్ కూడా పాల్గొంటారు.

Related posts