telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా మరణాలపై ఏపీ ప్రభుత్వం కమిటీ!

ap

ఏపీలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ బారిన పడి ఎంత మంది మరణించారన్న వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో పని చేసే ఈ కమిటీలో 9 మంది అధికారులు, నిపుణులు ఉంటారు. ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్, ఫోరెన్సిక్ విభాగ ప్రొఫెసర్ సహా ఇతర నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.కరోనా మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

Related posts