ఈరోజు అంటే అక్టోబరు 26వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల నుండి నైఋతి రుతుపవనాలు ఉపసంహరించాయి అని వాతావరణ అధికారులు తెలిపారు. సుమారుగా అక్టోబరు 28 వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుండి మరియు మొత్తం భారతదేశం నుండి నైఋతి రుతుపవనాలు ఉపసంహరించే అవకాశం ఉంది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలలో ఈశాన్య ఋతుపవన వర్షాలు సుమారుగా అక్టోబరు 28వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 3.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అందువల్ల రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయ్యింది. వర్షాల ధాటికి శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఇంకా అనేక కాలనీలు బురదలోనే ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.
ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటుపై బ్రదర్ అనిల్ హాట్ కామెంట్స్