ఇటీవల “గద్దలకొండ గణేష్”తో విజయం అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. “నేనూ గెలవాలి.. అల్ ది బెస్ట్. నేను గెలవాలి.. ఓకే. నేనే గెలవాలి.. సారీ బాస్” అంటూ హరీష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన సినిమాల గురించే హరీష్ ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో..’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల మధ్య పోటీ తీవ్రంగా సాగిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు, తర్వాత కూడా రెండు చిత్రబృందాలు ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. కలెక్షన్ల విషయంలో కూడా పోటాపోటీగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలనుద్దేశించే హరీష్ ఈ ట్వీట్ చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఏపీ రాజకీయాలనుద్దేశించి హరీష్ ఈ ట్వీట్ చేశారని కూడా కొందరు అనుకుంటున్నారు.
నేనూ గెలవాలి ….All the Best
నేను గెలవాలి …. Ok…..
నేనే గెలవాలి …. Sorry Boss….
— Harish Shankar .S (@harish2you) January 23, 2020