తన భర్త ఎదుర్కొన్న చేదు అనుభవాలను బాలీవుడ్ దివంగత నటుడు ఇందర్ కుమార్ పల్లవి కుమార్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. `సినిమాల్లో మళ్లీ అవకాశాలు పొందేందుకు నా భర్త, నేను ఓ రోజు కరణ్ జోహార్ వద్దకు వెళ్లాం. ఆయన తన వ్యాన్ బయట మమ్మల్ని రెండు గంటల పాటు వెయిట్ చేయించారు. చాలా సేపటి తర్వాత కరణ్ బయటకు వచ్చారు. తన మేనేజర్తో టచ్లో ఉండమని చెప్పారు. దాదాపు 15 రోజుల పాటు కరణ్కు ఫోన్ చేశాం. ఆయన సమాధానం చెప్పలేదు సరికదా మా నెంబర్ను బ్లాక్ చేసేశార`ని పల్లవి పేర్కొన్నారు. `తుమ్కో నా భూల్ పాయేంగే`, `కహీ ప్యార్ నా హో జాయే`, `ఖిలోడియోంకా ఖిలాడీ` వంటి సినిమాలతో 90వ దశకంలో ఇందర్ కుమార్ స్టార్గా వెలుగొందారు. అనంతరం సీరియళ్లలో నటించిన ఇందర్ కుమార్ 2017లో గుండెపోటుతో మరణించారు.
previous post