telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ అద్భుతమైన టీమ్‌తో మళ్లీ పని చేయాలని ఉంది : పూజాహెగ్డే

Pooja

అల్లు అర్జున్ సరసన ‘డీజే’, ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో, తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి వరుస హిట్లతో ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇక దర్శకుడు హరీష్ శంకర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’. ఈ సినిమాలో అత్యంత గ్లామరస్‌గా కనిపించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను తాజాగా పూజ గుర్తు చేసుకుంది. ఈ సినిమా సందర్భంగా తీసిన రెండు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “మిస్ డీజేగా మారడం ఎలాగో దువ్వాడ జగన్నాథమ్ నాకు చూపిస్తున్నాడు. హరీష్ శంకర్ సర్… ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా జరిగింది. సినిమా సెట్స్‌లో మనం అనుభవించిన ఫన్ ప్రేక్షకులను కూడా చేరింది. ఇలాంటి అద్భుతమైన టీమ్‌తో మళ్లీ పని చేయాలని ఉంది” అని పూజ పేర్కొంది.

Related posts