telugu navyamedia
సినిమా వార్తలు

అక్కడ సరికొత్త రికార్డు సృష్టిస్తున్న “సైరా”

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

అయితే ఈ చిత్రం బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయట. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ‘సైరా’ థియేట్రికల్ రైట్స్ రూ. 19.6 కోట్లకు కొన్నారట. ఇప్పటివరకూ ఏ హీరో సినిమాకు కూడా ఇంత మొత్తం ఇచ్చి కొనలేదట. భారతదేశంలోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన ‘బాహుబలి’ సినిమా థియేట్రికల్ హక్కులను కూడా తూర్పుగోదావరి జిల్లాలో రూ. 18 కోట్లకు మాత్రమే కొన్నారు. నిన్న మొన్నటి వరకూ జిల్లాలో ఈ చిత్రమే అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ థియేట్రికల్ రైట్స్ కూడా భారీగా అమ్ముడుపోయాయి. ‘బాహుబలి’ రికార్డును వెనుకకునెడుతూ రూ. రూ. 19.5 కోట్లకు అమ్ముడు పోయాయి. తాజాగా ‘సైరా’ నరసింహారెడ్డి థియేట్రికల్ రైట్స్ రూ.19.6 కోట్లకు అమ్ముడు పోయి ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోందట. దాదాపు రూ. 120 కోట్ల వరకూ బిజినెస్ చేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తోందట. రాయలసీమలోని కొన్ని ఏరియాల్లో ఇప్పటివరకూ ఏ హీరో అందుకోని రికార్డులను చిరంజీవి అందుకుంటారని నమ్ముతున్నారట.

Related posts