telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్‌కు పిలుపునిచ్చిన విరుష్క…

కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్‌కు పిలుపునిచ్చారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. కెట్టో సంస్థతో కలిసి #InThisTogether అనే ఫండ్ రైజింగ్‌ క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కోహ్లీ, అనుష్క శర్మ తమ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోంది. జనాలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది. మన కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న మెడికల్, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఏం చెప్పినా సరిపోదు. వారికి ఇప్పుడు మన మద్దుత అవసరం. అందుకే అనుష్క శర్మ, నేను.. కెట్టోతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపైన్ మొదలుపెడుతున్నాం. ప్రతీ రూపాయి ఎంతో ఉపయోగడపడుతుంది. మనం కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలిసి నడుద్దాం. కరోనాను జయిద్దాం’అని ఆ వీడియో ద్వారా విరుష్కా జోడీ పిలుపునిచ్చారు. అయితే ఈ పోస్ట్‌లో ఎక్కడా తాము ఎంత విరాళం ఇచ్చామనే విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.

Related posts