telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాప్‌లేపిన బౌలర్లు.. ఇంగ్లండ్‌పై ఇండియా భారీ విజయం

టీం ఇండియా మరోసారి దుమ్ములేపింది. పుణె వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలుపొందింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ రాణించిన టీం ఇండియా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 318 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్‌ జట్టు 251 పరుగులకే ఆలౌట్‌ అయింది. బెయిర్‌ స్టో 94 పరుగులు, జాసన్‌ రాయ్‌ 46 పరుగులు విధ్వంసంతో ఇంగ్లండ్‌ ఓ దశలో ఈజీగా గెలిచేలా కనిపించింది. అయితే ఇండియా బౌలర్లు రెచ్చిపోవడంతో.. ఇంగ్లీష్‌ బ్యాట్స్‌ మెన్స్‌ ఎక్కువగా సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక భారత బౌలింగ్‌లో తొలి మ్యాచ్‌లోనే ప్రసిద్ధ్‌ 4 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. అటు శార్దూల్‌ 3, భువనేశ్వర్‌ 2, కృనాల్‌ 1 వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ నిలిచింది.

Related posts