ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారస్థులు ఎరువుల నిల్వలను బ్లాక్ చేయడంతో కొరత ఏర్పడింది. ఈ క్రమంలో కృత్రిమ ఎరువుల కొరత నెలకొనడంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,193 ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎరువుల బస్తాలను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించినందుకు షాపుల యజమానులపై కేసులు నమోదుచేశారు. ఈ ఎరువుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ.11.50 లక్షలు ఉంటుందని ఓ విజిలెన్స్ అధికారి తెలిపారు. ఈ ఎరువుల బస్తాలను అనధికారిక ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారనీ, రైతులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని తమ తనిఖీలో తేలినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వలకు, వాస్తవ నిల్వలకు అసలు పొంతనే లేదని అధికారులు వివరించారు.
ప్రపంచానికే భారతదేశం ఆదర్శం ..ప్రపంచంలో మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కువ మంది భారతీయులే