ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నెల రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటిందని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే జగన్ మాత్రం తాడేపల్లిలోని తన రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదని దుయ్యబట్టారు.
జగన్ కు దమ్ముంటే కర్నూలు వెళ్లాలని సవాలు విసిరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 రెడ్జోన్లో ఉన్నాయన్నారు. కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న విషయమైనా జగన్కు తెలుసా? అని దేవినేని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించాలని హితవు పలికారు. కరోనా కేసుల వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా