టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. అమ్మ ఒడి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయన్నారు. విద్యార్థులను నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని కితాబిచ్చారు.
అమ్మఒడి నూతన ఒరవడి అని, ఈ పథకంతో పేద కుటుంబాల రూపురేఖలు మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా చరిత్రలో కొత్త శకం ప్రారంభం కాబోతోందన్నారు. పాలకుడు అంటే ఎలా ఉండాలి, పాలన అంటే ఉండాలో సీఎం జగన్ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.