హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి తాట తీస్తున్నారు. వారిపై జరిమానాలు విధిస్తూ, కేసులను పెట్టి, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కేవలం సడలింపులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు వదిలేస్తున్నారు.
నగరంలోని ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పికెటింగ్ ను ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు నిర్మాణ రంగానికి అనుమతులు ఇవ్వడం, మద్యం దుకాణాలు, ఉక్కు, సిమెంట్, ఎలక్ట్రికల్ దుకాణాలు తెరచుకోవడంతో ప్రజలు బయటకు రావడం పెరిగింది.
కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: జీవన్రెడ్డి