భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏవీవీ విద్యాసంస్థల ప్లాటినమ్ జూబ్లీ వేడుకలను వెంకయ్య ప్రారంభించనున్నారు. వెంకయ్య ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. ఉదయం 9:35 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్లోని ఏవీవీ కళాశాల మైదానానికి వస్తారు.
9:55 గంటలకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. 10:10 గంటలకు మంత్రి దయాకర్రావు ప్రసంగిస్తారు. 10:15 గంటలకు సావనీర్ ఆవిష్కరిస్తారు. నూతన భవనానికి వేదిక మీద నుంచే రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. అనంతరం వెంకయ్య ఢిల్లీకి బయలుదేరుతారు.