telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

బ్రేకింగ్ : ఏపీలో మరో అగ్ని ప్రమాదం..

fire in plastic factory dhaka 13 died

ఆంధ్రప్రదేశ్ ను అగ్ని ప్రమాదాలు వదలడం లేదు. లాక్ డౌన్ ప్రకటించిన నుంచి ఈ ప్రమాదాలు ఎక్కువగా కావడం గమనార్హం. ఇప్పటికే విజయవాడ స్వర్ణ ప్యాలస్, విశాఖలో అగ్నిప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. అంతే కాదు అంతర్వేది అగ్ని ప్రమాదంలో రథం దగ్దమైంది. తాజాగా…ఆంధ్రప్రదేశ్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రూమ్ లో అగ్నిప్రమాదం జరిగింది.

ఈ అగ్నిప్రమాదం సంభవించగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే..ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. విషయం తెలుసుకున్న దాచేపల్లి పోలీస్, రెవిన్యూ అధికారులు…సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మంటలు ఎగిసిపడటంతో కిలో మీటర్ పరిది వరకు కెమికల్ దుర్వాసన వ్యాపించింది. అధికారులు మంటలను అదుపుచేయక పోతే కెమికల్ దుర్వాసనకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు అనుకుంటున్నారు. దీంతో భయాందోళనలో స్తానికులు పరుగులు పెడుతున్నారు.

Related posts