నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యం చేధించలేక సన్ రైజర్స్ హైదరాబాద్ 20 పరుగులు తేడాతో ఐపీఎల్ 2020 సీజన్లో 5 వ ఓటమి చవి చూసింది. ఈ మ్యాచ్ లో 39 బంతుల్లో 57 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఒకడే రాణించాడు. కానీ అతనికి ఇతర బ్యాట్స్ మెన్ల మద్దతు లభించలేదు. ఈ మ్యాచ్లో హైదరాబాద్లో అత్యధిక పరుగులు చేసిన రెండో స్థానంలో జానీ బెయిర్స్టో (23) నిలిచాడు.
మ్యాచ్ అనంతర జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… అదనపు బ్యాట్స్మన్ తో ఈ మ్యాచ్ ఆడితే చాలా బాగుండేది. మేము రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత లక్ష్యం ఛేదించడం కష్టం అవుతుంది. అందువల్ల ఈ రోజు అదనపు బాట్స్మెన్ ఉంటే బాగుండేది అని డేవిడ్ వార్నర్ అన్నారు.
రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారు: రేవంత్