జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇళ్ల నిర్మాణాలపై కేటీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి జంటనగరాల్లో 85వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదలకు అందిస్తామని అన్నారు.
దాదాపు 8వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున రెండు పడకల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. చాలా చోట్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో త్రాగునీరు, కరెంట్, రోడ్లు ఇతర సదుపాయాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో పడకలు కరువయ్యాయి: ఉత్తమ్