telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ కు సిద్ధమైన గేల్…

టీ 20 ఫార్మాట్ లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ సృష్టించే విధ్వంసం గురించి అందరికి తెలుసు. అతను ఎంత సునాయాసంగా బంతిని బౌండరీ దాటిస్తాడు అనేది అందరూ చూసే ఉంటారు. ఇక ఐపీఎల్ లో కూడా గేల్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గేల్. ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విధ్వంసకర ఆటగాడు ఇప్పటివరకు ఐపీఎల్ 2020 లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే గేల్ అనారోగ్యం  కారణంగా పంజాబ్ ఆడిన 7 మ్యాచ్ లలో ఒక మ్యాచ్ లో కిడా బరిలోకి దిగలేదు. కానీ ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడటానికి యూనివర్స్ బాస్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. రేపు ఐపీఎల్ లో పంజాబ్ బెంగుళూర్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గేల్ ఆడనునట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు ఆడిన ఏడూ మ్యాచ్ లో కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న పంజాబ్ గేల్ రాకతోనైనా విజయం సాధిస్తుందా… లేదా అనేది చూడాలి. 

Related posts