శుక్రవారం రంజాన్ పండుగ సందర్భంగా జట్టులోని ముస్లిం క్రికెటర్లు అయిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అబ్డుల్ సమద్, ముజీబ్ ఉర్రెహ్మాన్లకు సన్రైజర్స్ హైదరాబాద్ విషెస్ తెలియజేసింది. వీరి ఫొటోలను సైతం షేర్ చేసింది. అయితే ఇక్కడే సన్రైజర్స్ హైదరాబాద్ పప్పులో కాలేసింది. జట్టులోని ఇతర ముసల్మాన్ క్రికెటర్లు అయిన ఖలీల్ అహ్మద్, షాబాజ్ నదీమ్లను మరిచిపోయింది. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రంజాన్ పర్వదినాన్ని పురుస్కరించుకొని మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఎలా జరుపుకుంటున్నారనే విషయాన్ని తెలిజేసే ఉద్దేశంతో సన్రైజర్స్ ఈ ట్వీట్ చేసింది. పండుగ సందర్భంగా వారి లుక్స్ అదిరిపోయానని, భద్రంగా పండుగ జరుపుకోవాలని క్యాప్షన్గా పేర్కొంది. ఈ ఫొటోల్లో మహ్మద్ నబీ తన పిల్లలతో ఉండగా.. రషీద్, ముజీబ్, సమద్ కొత్త బట్టల్లో జిగేల్మన్నారు. అయితే పండుగకు సంబంధించిన ఖలీల్, నదీమ్ ఫొటోలు లేకపోవడంతో సన్రైజర్స్ వారిని విస్మరించినట్లుంది. కానీ అభిమానులు మాత్రం వీరిని ఉద్దేశపూర్వకంగానే టీమ్మేనేజ్మెంట్ మరిచిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.
previous post
next post