telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక దొంగల పేర్లు ఇచ్చిన జగన్ స్పందించడం లేదు: అనురాధ

Panchumarthi-Anuradha

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ ఇసుక దొంగల పేర్లను తమ పార్టీ ఛార్జ్ షీట్ లో ఇచ్చినా ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని విమర్శించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎంత మంది చనిపోతున్నారో జగన్ కు కనిపించడం లేదని చెప్పారు.

తమ అధినేత చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షను దొంగ దీక్ష అని వైసీపీ నేతలు సంబోధిస్తున్నారని అన్నారు. వైసీపీ వారివే దొంగ దీక్షలని ఆమె వ్యాఖ్యానించారు. మద్దూరు ఇసుక టెండర్ ను వైసీపీ నేత పార్థసారథి తన అనుచరుడికి ఇచ్చారని ఆరోపించారు. దీక్ష చేస్తానంటున్న పార్థసారథికి దమ్ముంటే పెనమలూరులో దీక్ష చేయాలని అనురాధ సవాల్ విసిరారు.

Related posts