telugu navyamedia
రాజకీయ వార్తలు

మన్మోహన్ కోలుకుంటున్నారు: వెంకయ్య

venkaiah naidu

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (87) ఛాతీ నొప్పితో రెండు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు కొత్త మందులు ఇవ్వడంతో జ్వరం వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్తితిపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. మన్మోహన్ కోలుకుంటున్నారని తెలిపారు.

‘భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్దేశకుడితో మాట్లాడి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిసి సంతోషిస్తున్నాను. మన్మోహన్‌ సింగ్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుతున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

Related posts