మధ్యప్రదేశ్లో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ముఢనమ్మకాలు ఎక్కువుతున్నాయి. వర్షాలు కురిపించాలని వాన దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పారు. దమోహ్ జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారింది.
వింత ఆచారం..
కరవు పరిస్థితులు ఉన్నప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి ఏటా ఆ గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి.. వారితో బరువైన రోలు మోయించి.. వీధుల్లో తిప్పుతూ మహిళలు భజనలు చేసి, ఇలా సేకరించిన ఆహార పదార్థాలతో గ్రామ దేవాలయం ఎదుట అన్నదానం చేసి.. పూజలు చేస్తే వర్షం కురుస్తుందని ఆ గ్రామస్థుల మూఢ ఆచారం ఉంది.
ఆచారంలో భాగంగా ఆరుగురు బాలికలను నగ్నంగా తిప్పిన క్రమంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ ఘటన కంప్యూటర్ యుగంలోనూ కొనసాగుతున్న మూఢాచారాలకు అద్దం పడుతోంది.
కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్