జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తిరుపతిలో న్యాయవాదుల సమావేశంలో కూడా పవన్ అదేరీతిలో స్పందించారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటివాళ్లు పదవుల కోసం ప్రజల్లోకి రాలేదని, వాళ్లు చేసిన గొప్ప పనుల వల్లే నిత్యం వారిని స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ, జగన్ ను ముఖ్యమంత్రిగా గుర్తించనని తెగేసి చెప్పారు.
రాయలసీమలో బత్తాయిచెట్లు నరికించడం ఏం మానవత్వం? అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి చెడ్డపేరు ఎవరు తెచ్చారు? అని నిలదీశారు. వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. బాధ్యతగా ఉండాల్సిన వాళ్లే నిత్యం బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంతో కష్టసమయంలోనే జనసేన పార్టీ పెట్టానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మార్పు తెచ్చేందుకు జనసేన కంకణం కట్టుకుందని తెలిపారు. భావితరాల గురించి ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ పేర్కొన్నారు.
టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో బీజేపీ: కన్నా