telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

మహిళ, ఆమె స్నేహితుడికి గుండు గీయించి చెప్పులతో ఊరేగింపు

crime

ఓ మహిళతో పాటు ఆమె స్నేహితుడిని కొందరు దారుణంగా అవమానించారు. మహిళతో పాటు ఆమె స్నేహితుడికి గుండు గీయించి చెప్పుల దండలతో ఊరేగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కన్నౌజ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు.

వివరాల్లోకి వెళ్తే ఓ మహిళ భర్త రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె స్నేహితుడైన ఓ దివ్యాంగుడు ఆమెకు అనేక విషయాల్లో సాయం చేసేవాడు. అయితే వారిద్దరి మధ్య ఉన్న స్నేహంపై ఆమె బంధువులు అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో వారిద్దరు గ్రామంలోని ఓ ప్రాంతంలో బంధువుల కంటపడ్డారు. వారిద్దరికి గుండు చేయించి, ముఖానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండలు వేసి గ్రామంలో వారిని ఊరేగించారు. దీంతో బంధువులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో బాధితురాలి బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.

Related posts