telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారు: విజయశాంతి

vijayashanthi

తెలంగాణ సర్కార్ పై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని విజయశాంతి ట్విటర్ లో మండిపడ్డారు. నిజామాబాద్ లో ఒక యువతిపై సామూహిక అత్యాచారం ఘటన తనను కలచి వేసిందని ఆమె అన్నారు.ఎన్నో పోరాటాల తర్వాత సాధించిన మన తెలంగాణలో ఆడబిడ్డలపై ఇలాంటి ఘటనలు జరగడం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాది క్రితం జరిగిన దిశ ఘటనను మరువక ముందే  మరో ఘటన జరగడం దారుణమని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని అత్యున్నత అధికార యంత్రాంగం కొలువుండే కలెక్టరేట్ సమీపంలో ఈ ఘటన జరగడం ఆందోళనకరమని చెప్పారు.

మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెపుతున్న మాటలు నీటి మీద రాతలే అని తేలిపోయిందని ఆమె అన్నారు. మహిళల రక్షణ కోసం ఏమైనా చేస్తామని చెప్పే ప్రభుత్వ ప్రకటనలన్నీ బూటకమే అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతోందని విజయశాంతి అన్నారు.

Related posts