విరుష్క అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జంట విరాట్ కోహ్లీ, అనుష్కలలది. ‘జీరో’ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు అనుష్క. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్గా రానున్న ‘చక్దాహా ఎక్స్ప్రెస్’ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే కోహ్లీ కొద్ది సేపటి క్రితం తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నానని కోహ్లీ తన ట్విట్టర్ లో తెలిపాడు. “ఇప్పుడు మేం ముగ్గురు కాబోతున్నాం. 2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్టబోతున్నాడు” అని ట్విట్టర్ ద్వారా కోహ్లీ తెలిపాడు. ఈ విషయం ప్రకటించిన వెంటనే అభిమానులు, సెలబ్రిటీలు ఈ దంపతులకి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పూర్తి స్థాయి కెప్టెన్ బాధ్యతలు అప్పగించాక టీం ఇండియాను తిరుగులేని శక్తిగా నిలిపాడు. క్రికెట్ లో భారతదేశానికి ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్ళాడు.
previous post