హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై పోలీసులు కారును నిలిపివేశారు. ఓ పోలీసు కారును సైదాబాద్ టీ జంక్షన్ వద్ద రహదారికి అడ్డంగా పెట్టారు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని గుర్తించి పోలీసులకు ట్వీట్ చేశాడు.
రోడ్డుకి అడ్డంగా కారు పెట్టారని చెబుతూ ట్విట్టర్ ద్వారా నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాడు. అందుకు సంబధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు ఆ పోలీసు కారుకు జరిమానా విధిస్తూ చలానా పంపారు. రహదారికి అడ్డంగా పోలీసులు కారు నిలిపారని, దీంతో నిబంధనల ప్రకారం రూ.135 చెల్లించాలని అందులో పేర్కొన్నారు.