telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాని వ్యాఖ్యలపై ఢిల్లీ సీరియస్ అయ్యింది: వర్ల రామయ్య

varlaramaiah tdp

తిరుమల డిక్లరేషన్ అంశంపై ఏపీ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. తిరుమలకు సీఎం జగన్ సతీసమేతంగా రావాలంటూ బీజేపీ నేతలు పేర్కొంటుండడం పట్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ముందు ప్రధాని మోదీని సతీసమేతంగా వెళ్లి రామాలయం పూజ చేయమనండి అని అన్నారు. ఆ తర్వాతే బీజేపీ మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే బూతుల మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీపై పూనకం వచ్చినట్టుగా కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ సీరియస్ అయ్యిందని చెప్పారు. నానికి చదువు సంధ్యలు లేవని, అతడిని క్షమించండి అని ప్రధాని కార్యాలయంతో బేరమాడుతున్నారని వర్ల దుయ్యబట్టారు.

Related posts