telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వంశీని లొంగదీసుకునేందుకే తప్పుడు కేసు: చంద్రబాబు

chandrababu

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. వంశీని లొంగదీసుకునేందుకే తప్పుడు కేసు పెట్టారని అన్నారు. వంశీపై కేసు పెట్టడం కాదు, ఎమ్మార్వో, ఎస్సైలను అరెస్ట్ చేయాలని అన్నారు.టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సరెండర్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

వైసీపీ ప్రభుత్వ వేధింపులపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కోడి కత్తి కేసు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. సొంత బాబాయి వైయస్ వివేకా హత్య కేసును ఇంత వరకు తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులన్నింటినీ రివర్స్ టెండరింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts