telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గాంధీలో వార్డులన్నీ ఫుల్.. కింగ్ కోటి ఆసుపత్రికి రోగులు

karona ward in gandhi hospital

కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతుండడంతో హైదరాబాద్ లోని గాంధీ, చెస్ట్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డులన్నీ నిండిపోయాయి. దీంతో కింగ్ కోటి ఆసుపత్రికి రోగులను తరలిస్తున్నారు. సమీప భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ ని ఇప్పటికే ఐసోలేషన్ కోసం అధికారులు సిద్దం చేశారు.

తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే కొత్తగా ఆరు కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా, ఒకే కుటుంబంలోని ముగ్గురికి వైరస్ సోకింది. నాలుగు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యాపారి వైరస్ బారిన పడగా, తన కుమారుడికి, భార్యకు కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. గుంటూరుకు చెందిన యువకుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ రాగా అతనికి కూడా పాజిటివ్ వచ్చింది.

Related posts