దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని సుల్తాన్ బతేరీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయి. కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇందుకు దేశాన్ని పాలిస్తోన్న ప్రధాని మోదీయే కారణమని దుయ్యబట్టారు.
మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతోన్న విషయాన్ని ప్రతి రోజు మనం దినపత్రికల్లో చదువుతున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలోని దళితులు, గిరిజనులపై కూడా హింస పెరిగిపోతోందని అన్నారు. గిరిజనుల భూములను లాక్కుంటున్నారుని విమర్శించారు. అధికార దుర్వినియోగాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.