telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆంగ్ల దినపత్రిక కథనంపై కేటీఆర్ సంతోషం!

KTR TRS Telangana

ఓ ఆంగ్ల దినపత్రికలో ఈ రోజు ఉదయం ఓ వార్తను చదివిన తరువాత తనకెంతో గర్వంగానూ, సంతోషంగానూ అనిపించిందని తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. “గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టితో ప్రతి ఒక్కరికీ మంచి నీటిని అందిస్తున్నారు.

మిషన్ భగీరథలో భాగంగా అందరు ఇంజనీర్లు, అధికారులు నల్గొండ తదితర జిల్లాల్లో ఎంతో శ్రమించారు” అంటూ “గడచిన ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు” అంటూ పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ పోస్ట్ చేశారు.

Related posts