జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సోషల్ మీడియాలో తనను, జగ్గారెడ్డిని టీఆర్ఎస్ కోవర్టులుగా చూపుతు కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారని వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. తాము టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా తమ ఫొటోలు మార్ఫింగ్ చేశారని చెప్పారు.
ఆ ఫోటోలను తన ఫోన్లో పోలీసులకు చూపించారు. తాము టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నామని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలా కోవర్టులుగా తమను అభివర్ణించడం బాధ కలిగిస్తోందని అన్నారు. ఇలా చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ చెప్పారు.