telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ ఎమ్మెల్యేలకు త్వరలో కొత్త క్వార్టర్స్‌

Gurukulam entrance exam notification released
తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధించిన నూతన క్వార్టర్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర శాసనసభ్యులకు వివిధ పార్టీల నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మరో శాసనసభ్యుడు నామినేట్ అయ్యారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు అధునాతన సౌకర్యాలతో ఇండ్లు నిర్మించారు. 4.5 ఎకరాల్లో నిర్మించిన ఇండ్ల సముదాయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. 
కమిటీ వేసుకొని నియమ నిబంధనల మేరకే ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఒక్కో ఫ్లాట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగిందన్నారు. వాహనాల పార్కింగ్ కోసం 3 సెల్లార్లను నిర్మించామని,  ఒకేసారి 200 వాహనాలను నిలిపే విధంగా నిర్మాణం జరిగిందన్నారు. రూ. 166 కోట్లతో ఈ క్వార్టర్స్‌  నిర్మాణం జరిగిందని పోచారం వెల్లడించారు.

Related posts