అమెరికాలో ఓ హిందూ పూజారిపై దాడి జరిగింది. గ్రీన్ ఓక్స్ ప్రాంతంలోని శివ శక్తి పీఠంలో పూజారిగా ఉన్న హరీశ్ చందర్ పూరి పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పీఠం సమీపంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. హరీష్ చందర్ నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆయన్ను పలుమార్లు కొట్టాడు.
ఈ ఘటనలో స్వామీజీకి గాయాలు కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి సెర్జియ గువెయ (52)గా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది విద్వేషపూరితమైన దాడని, స్వామీజీని లక్ష్యంగా చేసుకుని ఇది జరిగిందని ఆయన శిష్యులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడికి పాల్పడే ముందు సెర్జియ, ఇది తమ ప్రాంతమని నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.
ఏపీలో ప్రతిపక్షం చేతులెత్తేసింది…