telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

చైనా ఓపెన్ ప్రపంచ టూర్ టోర్నీ : … సెమీస్ లో .. భారత్ ఓటమి..

india lost in semis of super 750 tourney

ఈ టోర్నీలో భారత జోడీ (సాత్విక్, చిరాగ్) సెమీస్‌లో ఓటమి పాలైంది. ప్రపంచ నెంబర్ వన్ జోడీ మార్కస్ ఫెర్నాల్డీ-కెవిన్ సంజయ(ఇండోనేషియా) చేతిలో 16-21, 20-22 తేడాతో పరాజితులయ్యారు. భారత జోడీ గట్టి పోటీనే ఇచ్చినప్పటికీ.. ఈ నెంబర్ వన్ జోడీ చేతిలో ఓటమి తప్పలేదు. ముఖ్యంగా రెండో గేమ్‌లో సాత్విక్, చిరాగ్ గట్టి పోటీ ఇచ్చారు. ఆఖరికి 22-20తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కోల్పోయారు.

క్వార్టర్స్‌లో భారత జోడీ 21-19, 21-15తో మూడో సీడ్ చైనా జోడీని చిత్తు చేసి సెమీస్‌లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గత టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మార్కస్- కెవిన్ జోడీతో పోరులోనే ఫైనల్లో భారత జోడీ(సాత్విక్-చిరాగ్) పరాజయం పాలయింది.

Related posts