telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు

liquor shops ap

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు నేటితో గడువు ముగియనుంది. రేపటి నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపద్యంలో షాపులను ఖాళీ చేసే పనుల్లో మద్యం వ్యాపారులు ఉన్నారు. మరోవైపు, ఎక్సైజ్ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరకును నిల్వచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆయా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బందిని సమకూర్చడం, కొత్తగా అమ్మకాలను ప్రారంభించడం వంటి పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. నూతన మద్యం విధానాన్ని అమలులోకి తెచ్చిన ఏపీ సర్కారు ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి, 3,448 దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి ఈ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరగనున్నాయి.

Related posts