telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

“ఎన్ కౌంటర్” పోలీసులకు రాహ్ గ్రూప్ నజరానా!

telangana police attacked by rajastan locals

వెటర్నరీ డాక్టర్ దిశ నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు నజరానా ప్రకటించింది. ఒక్కో పోలీసుకు రూ.లక్ష చొప్పున కానుకగా అందించాలని నిర్ణయించినట్టు రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ వెల్లడించారు. తెలంగాణ పోలీసులపై అందరూ ప్రశంసలు మాత్రమే కురిపిస్తుండగా, రాహ్ గ్రూప్ మాత్రం కాసుల వర్షం కురిపించాలని నిర్ణయించింది. రాహ్ గ్రూప్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Related posts