మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “వరలక్ష్మి అమ్మవారి పూజను నిజంగా ఎంతో ఆస్వాదించాను. అందుకు రామ్ చరణ్ కు, మా అత్తమ్మకు, డాక్టర్ సంగీతారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పూజను ఎంతో ప్రత్యేకంగా మలిచినందుకు వారికి ధన్యవాదాలు. ఎంతో సంతృప్తిగా ఉంది. మనందరిపైనా ఆ వరలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా, అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పట్ల తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటుంది. ఇక ఇది శ్రావణమాసం కావడంతో మహిళలకు ప్రతి దినమూ పవిత్రమైనదే. వరలక్ష్మి అమ్మవారికి రకరకాల పూజలు, నైవేద్యాలతో పూజాదికాలు, ఆరాధనలు నిర్వహించడం ఈ మాసంలో సాధారణమైన విషయం.
May Goddess Varalakshmi bless all of us with good health & happiness. 🙏🏼🙏🏼🙏🏼
Really enjoyed my Puja thanks to @AlwaysRamCharan , Athama & @drsangitareddy
Thanks soooo much for making it so special, I’m really blessed. 🤗🤗🤗 pic.twitter.com/ScNzf1fSYm— Upasana Konidela (@upasanakonidela) August 7, 2020