టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్ బి చక్రవర్తి నేడు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మరణించినట్టు తెలుస్తోంది. ఆయన శోభన్ బాబు గారితో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణ తో ‘కత్తుల కొండయ్య’, ‘నిప్పులాంటి మనిషి’, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ లతో ‘కాష్మోరా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకుడి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.