telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశంలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి: యోగి ఆదిత్యనాథ్‌

yogi adityanath

బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి దేశంలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అయోధ్య వివాదాన్ని బీజేపీ ప్రభుత్వం సున్నితంగా పరిష్కరించిందని పేర్కొన్నారు.

కశ్మీర్‌ సమస్య ఎంత కఠినమైనదో మీకు తెసుసు. అలాంటి సమస్యను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ద్వయం చాలా పకడ్బందీగా, ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా పరిష్కరించారనీ.. ఇది చరిత్రలో నిలిచిపోతుందని యోగీ అన్నారు. కాంగ్రెస్‌, జేఎంఎం, ఆర్జేడీకి అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని ఆయన గుర్తు చేశారు.

Related posts